హీరో మహేశ్ బాబుకి మాతృవియోగం

ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మాతృవియోగం కలిగింది.సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి (70) కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఇందిరా దేవి కన్నుమూశారు.ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియ జేస్తున్నారు.కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య.

వీరికి ఐదుగురు సంతానం.ఇద్దరు కుమారులు రమేశ్ బాబు, మహేశ్ బాబు తో పాటు ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శినిలు ఉన్నారు.

అయితే, ఇటీవలే రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

ఇందిరా దేవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు.

అనంతరం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి లోని..ఈ విషయాలు ప్రతి మహిళలోనూ ఉండాల్సిందే..!