కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి మనకు పరిచయం అవసరం లేదు.

బెల్లంకొండ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి శ్రీనివాస్ ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈయనకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలబడ లేకపోయినా శ్రీనివాస్ ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే నేడు సాయి శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు.

నేడు ఉదయం వీఐపీ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.

స్వామివారి దర్శనం అనంతరం బెల్లంకొండ కుటుంబసభ్యులు మీడియాతో ముచ్చటించారు.నేడు తన పుట్టినరోజు కావడంతో స్వామివారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నామని శ్రీనివాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఇక ఈ సందర్భంగా మీడియా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య జరుగుతున్న టికెట్ల వివాదంపై వీరిని ప్రశ్నించారు.

"""/" / అయితే ఈ విషయం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడటానికి నిరాకరించారు.

ఇకపోతే నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో పలువురు ఈ హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ … వీటిపై క్లారిటీ