ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టలేను అన్నయ్య… ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న అశ్విన్!

చేసినది చాలా తక్కువ సినిమాలో ఆయనప్పటికీ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అశ్విన్ (Ashwin)ఒకరు.

ప్రముఖ యాంకర్ ఓంకార్ (Omkar)సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అశ్విన్ రాజు గారి గది, జీనియస్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే అశ్విన్ ఇదివరకు పలు సినిమాలలో నటించిన ఏ సినిమా కూడా ఈయనకు సరైన సక్సెస్ అందించలేదని చెప్పాలి.

ఇలా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి అశ్విన్ తాజాగా హిడింబ (Hidimbi)అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యి మంచి హైప్ ను పెంచేసింది. """/" / అనిల్ సుంకర, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత (Nanditha Swetha) హీరోయిన్గా నటించారు ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి సిక్స్త్ సెన్స్ (Sixth Sense) కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యారు.

అశ్విన్, హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్, చిత్ర బృందం వచ్చారు.ఇక మొదటిసారి ఓంకార్ తన సోదరుడు అశ్విన్ తో కలిసి ఈ గేమ్ ఆడబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.

"""/" / ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ అశ్విన్ ను ప్రశ్నిస్తూ నీ లైఫ్ లో ఏదైనా బాధను నాకు చెప్పకుండా దాచావా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అశ్విన్ చాలా బాధపడుతూ నా స్ట్రగుల్స్ నీతో చెప్పుకోలేదు అన్నయ్యా అనేశాడు.

అలా దాచిపెట్టిన ఒక్క స్ట్రగుల్ చెప్పు అని అడిగారు ఓంకార్.ఆ మాటతో అశ్విన్ మరింత ఎమోషనల్ అయ్యారు.

నీకు ఇబ్బంది వచ్చిన సమయంలో నాతో చెప్పుకోవడానికి ఏంటి.నీకు అన్నయ్య అయినా.

నాన్న అయినా నేనే కదా అని ఓంకార్ అడగడంతో ఆ మాటలకు అశ్విన్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇలా ఈయన ఎమోషనల్ అవుతూనే ఇప్పటివరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను చూసుకున్నావ్.

కానీ నా ఇబ్బందులు చెప్పి మరి నిన్ను ఇబ్బంది పెట్టలేను అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకోగా తన తమ్ముడి మాటలకు ఓంకార్ కూడా ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

వైరల్ వీడియో: విద్యుత్ కేంద్రం కూలింగ్ టవర్లు కూల్చివేసిన అధికారులు..