టాలీవుడ్ లో ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుంది.. ఫుల్ స్పీడ్ గా ఉంది కదా !

కరోనా మహమ్మారి వల్ల చిత్రాల విడుదల దాదాపుగా రెండేళ్లుగా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి.

థియేటర్స్ కంప్లీట్‌గా ఓపెన్ అవడంతో ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు.ఈ క్రమంలోనే చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

టాలీవుడ్ సినిమాలు జెట్ స్పీడ్‌లో నిర్మితమవుతున్నాయి.అతిత్వరలో చిత్రాలు విడుదల చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని హీరోలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అనుకుంటున్నారు.

ఇకపోతే ఏయే చిత్రాల షూటింగ్ ఏ దశలో ఉన్నాయంటే.మెగాస్టార్ చిరంజీవి -కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన ‘ఆచార్య’ ఫిల్మ్ షూట్ కంప్లీట్ కాగా, త్వరలో ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.

ఈ సినిమా పూర్తి కాగానే చిరంజీవి ప్రజెంట్ ‘లూసిఫర్’ రీమేక్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ షూట్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

తమిళ్ డైరెక్టర్ మోహన్‌రాజా డైరెక్షన్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.ప్రజెంట్ ఊటిలో సీన్ల చిత్రీకరణ జరుగుతోంది.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ డిసెంబర్‌లో విడుదల కానుంది.

"""/"/ ఈ నేపథ్యంలో మూవీ లాస్ట్ షెడ్యూల్ షూట్‌ను భూత్ బంగ్లాలో చేస్తున్నారు.

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి ‘బంగార్రాజు’ మూవీతో దిగబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో వేగంగా చేస్తున్నారు.

మరో సీనియర్ హీరో వెంకటేశ్ నటిస్తున్న ‘ఎఫ్ 3’ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది.

ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతోంది.నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘అంటే సుందరానికి’ ఫిల్మ్ షూటింగ్ మాదాపూర్ లొకేషన్స్‌లో జరుగుతోంది.

రవితేజ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగ్, శర్వానంద్ హీరోగా వస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫిల్మ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఇక మ్యాచో మ్యాన్ గోపీచంద్- సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రం హైదరాబాద్ లోకల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తున్నారు.

ఏపీ ఎన్నికల సరళి పై సినీ నటుడు నరేష్ కీలక వ్యాఖ్యలు..!!