Hema Malini : ధర్మేంద్ర లిప్ లాక్ సీన్ పై స్పందించిన హేమా మాలిని .. అందుకు సంతోషంగా ఉందంటూ?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్( Director Karan Johar ) దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ( Rocky Aur Rani Ki Prem Kahani ).

ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.అయితే, ఇందులోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో సీనియర్‌ నటుడు ధర్మేంద్ర, షబానా అజ్మీ కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా కథలో భాగంగా వీళ్లిద్దరూ లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించిన సంగతి కూడా తెలిసిందే.

"""/" / అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించిన విషయం తెలిసింది.దీంతో 87 ఏళ్ల వయసులో ఇలాంటి సీన్స్‌లో ఎందుకంటూ నెట్టింట కొందరు ట్రోల్‌స్ కూడా చేశారు.

తాజాగా ఈ సన్నివేశాలపై ధర్మేంద్ర భార్య హేమమాలిని అందించారు.ఈ సందర్భంగా హేమమాలిని మాట్లాడుతూ.

నేను ఇంకా సినిమా చూడలేదు.ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతున్నందుకు సంతోషంగా ఉంది.

ధర్మేంద్ర విషయంలోనూ నేను ఎంతో ఆనందంగా ఉన్నాను.అతడు కెమెరా ముందు ఉండటానికి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు.

"""/" / సినిమాను ప్రేమిస్తాడు అని చెప్పుకొచ్చింది హేమమాలిని.ఇకపోతే ఈ సన్నివేశంలో నటించిన నటి షబానా అజ్మీ( Actress Shabana Azmi ) దీనిపై మాట్లాడుతూ.

దృఢంగా ఉండే స్త్రీ జీవితంలో రొమాన్స్‌ ఉండకూడదా? ఈ సినిమా విడుదలైన నాటి నుంచి నాకు ఎన్నో ఫోన్‌లు, మెసేజ్‌లు వస్తున్నాయి.

కరణ్‌ జోహర్‌ ఎంతో రిస్క్‌ చేసి ఈ సన్నివేశాన్ని పెట్టారు.ఇప్పుడు ఈ చిత్రానికి వస్తున్న ఆదరాభిమానాలన్నీ ఆయనకే చెందుతాయి అని చెప్పుకొచ్చింది.

ఇటీవలె ఈ సినిమా విడుదలైన తెలిసింది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన సీక్వెల్‌ పనులు కూడా మొదలయ్యాయట.

ఇదే విషయాన్ని స్వయంగా కరణ్‌ జోహార్‌ తెలిపారు.సీక్వెల్‌లో మరికొంతమంది కొత్తనటీనటులు ఉంటారని తెలిపారు.

వైరల్ వీడియో: దేవుడా. రన్నింగ్ ట్రైన్‌పై ప్రయాణించిన వ్యక్తులు.. చివరకు.