దూరవిద్యా కేంద్రంలో భారమైన చదువులు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:ఆర్థిక కారణాలు,చిన్న వయసులో పెళ్లిల్లు,కొన్ని ఇతర కారణాల వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు.
అలాంటి విద్యార్థులు తిరిగి మళ్లీ చదువుకోవడం కోసం ప్రభుత్వం దూర విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఇందులో చదువుకున్న అనేకమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు.ఇదిలా ఉంటే కోదాడ పట్టణంలోని కెఆర్ఆర్ కళాశాల అధ్యాపకుల నిర్లక్ష్యమో,యూనివర్సిటీ అధికారుల వైఫల్యమో తెలియదు కానీ,కొంతమంది విద్యార్థులు చేయని తప్పునకు బలయ్యామని బోరుమంటున్నారు.
వివరాల్లోకి వెళితే కోదాడ పట్టణంలోని కాకతీయ దూరవిద్యా కేంద్రంలో అనేకమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్ నెలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు.వాటికి సంబంధించిన ఫలితాలను ఈనెల 2 వ తేదీ శనివారం యూనివర్సిటీ విడుదల చేసింది.
ఫలితాలు చూసుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.సుమారుగా 25 మంది విద్యార్థులకు పైగా మాల్ ప్రాక్టీస్ అని రిజల్ట్ చూపించారు.
దీనితో బాధిత విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.మేము ఎక్కడా చూసి రాయలేదని,అందరిలాగానే పరీక్షలు రాశామని,పరీక్ష పూర్తయిన అనంతరం బుక్లెట్ అందజేసి వచ్చామని, మా పరీక్షను మాల్ ప్రాక్టీస్ అని ఎలా వస్తుందని, నాతో పాటు మా అక్క రిజల్ట్ కూడా మాల్ ప్రాక్టీస్ అని ఎలా వస్తుందని ఓ స్టూడెంట్ ప్రశ్నించారు.
కళాశాల అధ్యాపకులు,యూనివర్సిటీ అధికారులు
మా జీవితాలతో చెలగాటం ఆడొద్దని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.ఒకవేళ విద్యార్థులు నిజంగానే మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే,వారితో అండర్ టేకింగ్ రాయించుకొని బుక్ లేట్ను సీల్డ్ కవర్లో యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది.
ఇవేమీ పాటించకుండా మాల్ ప్రాక్టీస్ అంటూ మమ్మల్ని ఎలా బలి చేస్తారని విద్యార్థులు వాపోతున్నారు.
*ఈ నెల ఆరు నుంచి పరీక్షలు*
ఇదిలా ఉండగా,ఈనెల 6వ తేదీ నుంచి యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం పరీక్షలు జరగనున్నాయి.
దీంతో మాల్ ప్రాక్టీస్ అయిన విద్యార్థులకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనే క్లారిటీ లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.
అడ్మిషన్ వేసిన సెంటర్లో అడిగితే వారు ఏమి సమాధానం చెప్పడం లేదని,జరిగిన విషయాన్ని యూనివర్సిటీకి తెలియజేశామని సెంటర్ వారు చెబుతున్నారు.
ఏం చేయాలో అర్థంకాక ఎవరిని అడగాలో తెలియక విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు.మాకు ఎటువంటి సంబంధం లేదు:కెఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్.
సెకండియర్ విద్యార్థులు సుమారు 25 మంది పైగా మాల్ ప్రాక్టీస్ రిజల్ట్ చూపిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది.
మేము వారికి సంబంధించి మాల్ ప్రాక్టీస్ చేసినట్లుగా యూనివర్సిటీకి పంపించలేదు.పరీక్షలు జరుగుతున్న సమయంలో మేము తనిఖీలు చేసి, పట్టుబడ్డ విద్యార్థులకు మాత్రమే మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేశాం.
మిగతా విద్యార్థులను మాల్ ప్రాక్టీస్ చేయలేదు.ఫలితాలు వచ్చిన వెంటనే మాకు తెలిసింది.
కేఆర్ఆర్ కళాశాల పరీక్షల నిర్వహణలో పకడ్బంధీగా ఉంటుందని సెలవిచ్చారు.మరి ఆ 25 మంది విద్యార్థుల భవితవ్యం ఏమి కానుంది?ఎవరు బాధ్యత వహించాలనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది??.
దేవర సీక్వెల్ కు మూహూర్తం ఫిక్స్ అయిందట.. 2025లోనే తారక్ శుభవార్త చెప్పనున్నారా?