కిన్నెర‌సాని జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెర‌సాని జ‌లాశ‌యం నిండుకుండ‌లా ద‌ర్శ‌న‌మిస్తోంది.డ్యామ్ కు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది.

దీంతో నీటిమ‌ట్టం 404.80 అడుగుల‌కు చేరింది.

అప్ర‌మ‌త్త‌మైన అధికారులు జ‌లాశ‌యం 4 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీరు విడుద‌ల చేశారు.

డ్యామ్ నీటి సామ‌ర్థ్యం 407 అడుగులుండ‌గా, ఇన్ ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.

ఈ క్ర‌మంలో లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

టాయిలెట్‌లో వింత శబ్దం.. తీరా చూస్తే 10 అడుగుల పెద్ద పాము?