ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.

ఈ క్రమంలో పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.

కాగా సీబీఐ కేసులో ఫిబ్రవరి 26వ తేదీన మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

విశాల్ సినిమాకు భారీ షాకిచ్చిన తెలుగు ప్రేక్షకులు.. అక్కడే తప్పు జరిగిందా?