చంద్రబాబు ఎస్ఎల్పీపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

కోర్టు నంబర్ ఆరులో 63వ ఐటెంగా ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

అయితే జాబితాలో చిట్ట చివరి కేసు 63వ నంబర్ గా చంద్రబాబు కేసు ఉంది.

పిటిషన్ జాబితాలో ఆఖరులో ఉండటంతో విచారణకు వస్తుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

కాగా ఈ కేసును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది బెంచ్ విచారించనుంది.

ఈ క్రమంలో చంద్రబాబు కేసు విచారణకు వస్తుందా ? లేదా అన్ని విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్డీఏ కులమతాల మధ్య చిచ్చు పెడుతోంది.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్