చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

ఈ మేరకు పిటిషన్ ను దసరా సెలవుల తరువాత విచారిస్తామని పేర్కొంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే వాయిదా నాటికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టును సమర్పించాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇదే కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

చూపు లేకపోయినా ఐఐఎం పరీక్షలో ప్రతిభ చూపిన యువతి.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!