MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో( Supreme Court ) ఇవాళ విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో కవితకు ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఈడీ( ED ) కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

అయితే మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లను కవిత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

"""/" / ఈడీ నోటీసులను రద్దు చేయాలని, ఈడీ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.

అలాగే సీఆర్పీసీ నిబంధనల ప్రకారం ఈడీ విచారణ జరపడం లేదంటూ కవిత ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ పై( Kavitha Petition ) ఇవాళ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది.

ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థల ముందు కవిత హాజరుపై నేటి విచారణతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.