బండి సంజయ్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

బండి సంజయ్ రిమాండ్ ను సవాల్ చేస్తూ బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇటీవల ప్రభుత్వంతో పాటు స్కూల్ హెడ్ మాస్టర్ కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

కాగా ఇదే వ్యవహరంలో బండి సంజయ్ కుట్రదారు అనే విషయం తేలిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు.మరోవైపు ఇదంతా రాజకీయ కుట్ర అని రాంచందర్ వాదించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మరోసారి బండి సంజయ్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది.

ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఆస్ట్రేలియా కొత్త నిబంధనలు.. ఏంటంటే..