నెయ్యి, లవంగం కలిపి తీసుకుంటే ఆ జబ్బులన్నీ పరార్!
TeluguStop.com
నెయ్యి, లవంగం.ప్రత్యేకమైన రుచులను కలిగి ఉండే ఈ రెండూ విడి విడిగా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.
ఆరోగ్యానికీ అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి.అందుకే చాలా మంది నెయ్యి, లవంగాలను రెగ్యులర్ డైట్లో ఉండేలా చూసుకుంటారు.
అయితే ఈ రెండింటినీ విడి విడిగా కంటే కలిపి తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందొచ్చు.
అవు నెయ్యిలో లవంగాలను కలిపి తీసుకుంటే పలు రకాల అనారోగ్య సమస్యలు పరార్ అవుతాయి.
మరి ఆలస్యం ఎందుకు నెయ్యి, లవంగాలను కలిపి ఎలా తీసుకోవాలి.? అసలు ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ.
? వంటి విషయాలను తెలుసుకుందాం పదండీ.ముందుగా మూడు లేదా నాలుగు లవంగాలను తీసుకుని మెత్తగా దంచి పొడి చేసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, పొడి చేసుకుని పెట్టుకున్న లవంగాలు వేసి బాగా కలిపి గంట పాటు వదిలేయాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.
"""/" /
ఇలా ప్రతి రోజు చేస్తే గనుక రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉండే తగ్గు ముఖం పడతాయి.
అలాగే పైన చెప్పిన విధంగా నెయ్యి, లవంగాలను తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ఫలితంగా గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రోగ నిరోధక శక్తి నిద్ర లేమి బాధితులకు నెయ్యి, లవంగాల మిశ్రమం గొప్ప ఔషదంలా పని చేస్తుంది.
నెయ్యిలో లవంగాల పొడిని కలిపి రోజుకు ఒక సారి తీసుకుంటే నిద్రలేమి వ్యాధి పరార్ అవుతుంది.
అంతే కాదు, నెయ్యి, లవంగాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.బరువు తగ్గుతారు.
మరియు ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.
బుక్పై ఇండియన్ లాంగ్వేజ్ టెక్స్ట్.. హెల్ప్ కోరిన యుఎస్ వ్యక్తి..?