పెరుగులో ఎండుద్రాక్షను నానబెట్టి తింటే.. ఆ జ‌బ్బులు దూరం?

పెరుగు.ఇది లేనిదే చాలా మందికి రోజు కూడా గ‌డ‌వ‌దు.

ముఖ్యంగా మ‌న భార‌త‌దేశంలో భోజ‌నం త‌ర్వాత పెరుగు తినే అల‌వాటు ఎంద‌రికో ఉంటుంది.

రుచిలోనే కాదు.బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ పెరుగు ముందుంటుంది.

ఇక ఎండు ద్రాక్ష గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.వీటినే మ‌న దేశంలో కిస్మిస్ అని అంటారు.

అనేక పోష‌క విలువ‌లు దాగి ఉండే ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే పెరుగు, ఎండు ద్రాక్ష విడి విడిగా రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి అంద‌కీ తెలుసు.

కానీ, రెండు క‌లిపి తింటే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొంద‌డంతో పాటు అనేక జ‌బ్బులకు కూడా దూరంగా ఉండొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.

అవును, పెరుగులో ఎండు ద్రాక్ష‌‌ను నాన బెట్టి ప్ర‌తి రోజు తీసుకుంటే.సూప‌ర్ బెనిఫిట్స్ పొందొచ్చు.

మ‌రి ఆ బెనిఫిట్స్ ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా నేటి కాలంలో న‌ల‌బై ఏళ్ల‌కే కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డుతున్నారు.

అయితే ప్ర‌తి రోజు పెరుగులో ఎండు ద్రాక్ష‌ను నాన‌బెట్టి తీసుకుంటే.అందులో అధికంగా ఉండే కాల్షియం ఎముక‌ల‌ను, కండ‌రాల‌ను దృఢ‌ప‌రిచి.

కీళ్ల నొప్పుల‌ను దూరం చేస్తుంది.అలాగే మ‌హిళ‌లు మ‌రియు చిన్న పిల్ల‌ల్లో ర‌క్త హీన‌త స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది.

అయితే ర‌క్త హీన‌త‌ను నివారించ‌డంలో పెరుగు- ఎండు ద్రాక్ష కాంబినేష‌న్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, ర‌క్త హీన‌త ఉంటే ఖ‌చ్చితంగా పెరుగులో ఎండుద్రాక్షను నానబెట్టి తీసుకోండి.ఇక ఈ రెండు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల రోగనిరోధక శక్తి కూడా బ‌ల‌ప‌డి.

సీజ‌న‌ల్‌గా వ‌చ్చే జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ కల్పిస్తుంది.అదేవిధంగా.

నోటి పూత‌, చిగుళ్ల వాపు, చిగుళ్ల నొప్పి ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు భోజ‌నం త‌ర్వాత పెరుగులో ఎండుద్రాక్షను నానబెట్టి తీసుకోవాలి.

ఇలా చేస్తే నోట్లో చెడు బ్యాక్టీరియా సంఖ్య త‌గ్గించి.స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.

అలాగే కంటి చూపు మంద‌గించిన వారు ప్ర‌తి రోజు పెరుగులో ఎండుద్రాక్షను నానబెట్టి తింటే కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

అంతేకాదు, ఈ రెండు క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌ల‌కు కూడా దూరంగా ఉండొచ్చు.