కంప్లైంట్లు చేసి విసుగెత్తిపోయాడు.. చివరికి ఆఫీసర్ టేబుల్పై పాము విసిరేశాడు!
TeluguStop.com
హైదరాబాద్లో( Hyderabad ) ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది.
మున్సిపల్ కార్పొరేషన్ ( Municipal Corporation )అధికారులకు ఓ వ్యక్తి షాకిచ్చాడు.ఈ వ్యక్తి తన ఇంట్లో పాము ఉందని, దానిని పట్టుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్కు పలుమార్లు ఫిర్యాదు చేశాడు.
ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.చివరికి చిర్రెత్తుకొచ్చి ఆ వ్యక్తి స్వయంగా పామును పట్టుకున్నాడు.
అంతే కాదు ఈ పాముతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని అక్కడి అధికారుల టేబుల్పై పామును వదిలేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. """/" /
బీజేపీ నేత విక్రమ్ గౌర్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
'మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు హైదరాబాద్లోని అల్వాల్లో( Alwal, Hyderabad ) ఎలాంటి విచారణ జరపడం లేదు.
ఓ వ్యక్తి పామును పట్టుకుని జీహెచ్ఎంసీ వార్డు( GHMC Ward ) కార్యాలయానికి చేరుకుని పామును అక్కడే వదిలేశాడు.
వర్షం కురుస్తున్న సమయంలో ఈ పాము అతని ఇంట్లోకి ప్రవేశించింది.ఎన్ని సార్లు జీహెచ్ఎంసీకి కంప్లయింట్ చేసినా వారు పట్టించుకోకపోవడంతో విసుగెత్తి ఇలా చేశాడు' అని పేర్కొన్నారు.
అయితే ఆఫీస్ టేబుల్పై పామును వేశాక అధికారులు భయపడ్డారు.తమ ఆఫీసు నుంచి బయటకు పరుగులు పెట్టారు.
"""/" /
ప్రస్తుతానికి ఈ విషయమై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
పాము దాదాపు 5 అడుగుల పొడవు ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు.మరోవైపు పామును పట్టుకుని తీసుకొచ్చిన వ్యక్తి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు.
ఏదేమైనా ఆ యువకుడు చేసిన పనిని చాలా మంది ప్రశంసిస్తున్నారు.ఏదైనా సమస్య ఉందని చెబితే ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని, అలాంటి వారికి ఆ యువకుడు తగిన గుణపాఠం నేర్పాడని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
పాండాలను చైనాకు తిరిగి ఇచ్చేస్తున్న ఫిన్లాండ్ జూ.. అందుకేనట..