భూషణ్ రావు పేటలో హార్వెస్టర్ దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోనీ కథలాపూర్ మండలంలోని భూషణ్ రావు పేట గ్రామంలో ఒక హార్వెస్టర్ లో మంటలు చెలరేగి దగ్ధమైంది.

శనివారం పొలంలో వరి కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ కు మంటలు అంటుకున్నాయి.

అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి డ్రైవర్ తప్పించుకోవడంతో ప్రాణ నష్టం తప్పింది.మెట్ పల్లిలోని అగ్నిమాపక కేంద్రానికి రైతులు సమాచారం అందించగా, హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

జాకీచాన్-ప్రభాస్, బన్నీ-చెర్రీ లాంటి మల్టీస్టారర్స్‌ ప్లాన్ చేశారు.. కానీ..??