సాయి ధరమ్ తేజ్ ను కలిసిన హరీష్ శంకర్.. చేతిలో చెయ్యేసిన ఫోటో వైరల్?

గత నెల 10వ తేదీన మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయనకు అపోలో ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ నెలరోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు.

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెపుతున్నారు.

దీంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందారు.ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ దసరా పండగ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ ను కలవడం కోసం పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్తున్నారు.

ఇదిలా ఉండగా దర్శకుడు హరీష్ శంకర్ సాయి ధరమ్ తేజ్ కలిసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సాయి ధరమ్ చేతిలో హరీష్ శంకర్ చెయ్యి వేసిన ఫోటోని షేర్ చేస్తూ.

నా తమ్ముడు సాయిధరమ్ ను కలిసాను అతడు ఎంతో ఫిట్ గా ఉన్నాడు.

ఫుల్లీ లోడెడ్ అంటూ చేతిలో చేయి వేసిన ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటో చూసిన కొందరు అభిమానులు ఆనందం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది అంటూ తన చేతి వేళ్ళను చేతులను మాత్రమే చూపెడుతున్నారు కానీ ఇప్పటివరకు తన మొహాన్ని చూపించకపోవడంతో తన మొహానికి ఏవైనా గాయాలు తగిలాయా అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Dasyam Vinay Bhasker : నాయకత్వానికి చాడీలు చెప్పడం కడియం నైజం..: దాస్యం వినయ్ భాస్కర్