హార్ ఘర్ తిరంగ ప్రచార కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమాన్ని జాతీయ పండగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి.ఆ చిత్రాన్ని హర్‌తిరంగా.

కామ్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ సూచించిన విషయం విధితమే.

ఈ విషయాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.

ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాలను వేసి కార్యక్రమం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పేరుక గంగరాజు, చింతకుంట గంగాధర్, చింతకుంట సాగర్, సంపునూరి దేవయ్య, పేరుక రంజిత్, ముప్పిడి సత్తయ్య, పూడూరి అజయ్, ఐతం వంశీ తదితరులు పాల్గొన్నారు.

నాస్టాల్జిక్ సీన్లతో ఆకట్టుకున్న “కమిటీ కుర్రోళ్లు”.. ఎక్కడ దెబ్బ కొట్టింది?