చేనేత కార్మికులను ఆదుకోవాలి – మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ హాజరై చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేనేత వర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆర్ధికంగా వారిని ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫ్యామిలీతో వెకేషన్ లో చిల్ అవుతున్న బన్నీ… ఫోటోలు వైరల్!