జగన్‌కు ఓటేసినందుకు మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకోవాలంటూ దివ్యాంగుడు

తిరుపతి జిల్లా,వెంకటగిరి ముఖ్యమంత్రి జగన్‌కు ఓటేసినందుకు మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకోవాలంటూ దివ్యాంగుడు చింతపట్ల వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు.

వెంకటగిరి పరిధిలోని వెలంపాళెంకు చెందిన వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు పనిచేయవు.చేతులు వంకర తిరిగాయి.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛను మంజూరైంది.ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

తనలాంటి వందలాది మందికి పింఛను తొలగించి ఆవేదన మిగిల్చారని వెంకటేశ్వర్లు వాపోయారు.వీలైతే న్యాయం చెయ్యండి లేకపోతే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యండి అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఏందయ్యా ఇది.. ఉద్యోగులను, బాస్‌లను అమ్మేస్తున్న చైనీస్ ఎంప్లాయిస్..?