రెండవసారి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా హమీద్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పిసిసి ఆదేశాల మేరకు రెండవసారి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా హమీద్ ను నియమించారు.

వారి నియామకానికి సహకరించిన పొన్నం ప్రభాకర్, కేకే మహేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

మండల అధ్యక్షుని పదవి హమీద్ కు ఇవ్వడంతో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ స్థూపం వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేస్తున్నారు.

అనంతరం వారు మాట్లాడుతు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా హమీద్ ను నియమించి నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హమీద్ ఇంకా ఉన్నత పదవులు పొంది ఉన్నత శిఖరాలు చేరాలని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాప గారు రాజు, జంగం రాజు, లచ్చయ్య, ఉమారాలి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జ్వరం వచ్చినా సినిమా షూటింగ్స్ లో పాల్గొన్న టాలీవుడ్ సెలబ్రిటీలు.. ఎవరంటే..?