గుర్తుందా శీతాకాలం స్టార్ట్…. తమన్నా, సత్యదేవ్ రోమాన్స్ పీక్స్ లోనే

కంటెంట్ బేస్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్.

తాజాగా ఈ టాలెంటెడ్ హీరో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమాతో తన కెరియర్ కి మంచి ఊపు వచ్చింది.టాలెంటెడ్ దర్శకులు సత్యదేవ్ హీరోగా సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నారు.

అలాగే నిర్మాతలు కూడా సత్యదేవ్ మీద డబ్బులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఒటీటీలో వరుస వెబ్ సిరీస్ లు చేస్తు అక్కడ కూడా తన ఇమేజ్ పెంచుకుంటున్నారు.

ఒటీటీ స్టార్ గా మారిపోతున్నాడు.ఇప్పుడు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో సత్యదేవ్ మోస్ట్ హ్యపెనింగ్ హీరో.

ఇదిలా ఉంటే సత్యదేవ్ హీరోగా ఆ మధ్యకాలంలో కన్నడ హిట్ మూవీ రీమేక్ ని ప్రకటించారు.

ఈ సినిమాలో సత్యదేవ్ తో స్టార్ హీరోయిన్ తమన్నా రొమాన్స్ చేయబోతుంది.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా కోసం గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక తాజా గా ఈ సినిమా కొబ్బరి కాయ కొట్టుకొని ప్రారంభం అయ్యింది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ నేడు పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర హీరో స‌త్య‌దేవ్, ద‌ర్శ‌కనిర్మాత నాగ‌శేఖ‌ర్, సంగీత ద‌ర్శ‌కుడు కాల‌భైర‌వ‌, సినిమాటోగ్రాఫ‌ర్ స‌త్య హెగ్ఢే, చిత్ర యూనిట్ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో తమన్నా, సత్యదేవ్ మధ్య నడిచే రొమాంటిక్ లవ్ ట్రాక్ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సందర్భంగా దర్శకుడు నాగ శేఖర్ తెలిపారు.

ఈ సినిమా కోసం తమన్నాతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం అని సత్యదేవ్ చెప్పాడు.

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియాజేశారు.

ఏలూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత..!!