జ్యోతి మర్డర్ మిస్టరీ! హత్య కేసులో నిందితుల అరెస్ట్!

గుంటూరు మంగళగిరిలో ప్రేమజంటపై దాడిలో ప్రియురాలు జ్యోతి మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఈ దాడిలో ప్రేమికుడు శ్రీనివాస్ గాయాలతో హాస్పిటల్ లో చేరాడు.అయితే దీనిపై మృతురాలి తల్లిదండ్రులు మొదటి నుంచి జ్యోతి ప్రియుడుగా చెప్పబడుతున్న శ్రీనివాస్ మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు.

అయితే ఈ కేసులో మొదటిగా పోలీసులు విచారణ సరిగా చేయలేదనే ఆరోపణలు రావడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న రూరల్ ఎస్పీ, ఈ కేసు విచారణ బాద్యతని అతనే చేపట్టాడు.

ఇక చాలా రోజులు జ్యోతి మర్డర్ మిస్టరీని చెందించే ప్రయత్నం మొదలెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆమెని హత్య చేసింది శ్రీనివాస్ అని నిర్ధారించారు.

అతనికి పవన్ కళ్యాణ్ అనే స్నేహితుడు సాయం చేసినట్లు నిర్ధారించిన పోలీసులు పక్కా సాక్ష్యాధారాలు సేకరించి ఇద్దరిని అరెస్ట్ చేసారు.

జ్యోతి, శ్రీనివాస్ ని పెళ్లి చేసుకోమని పదే పదే కోరడంతో, అలాగే వారి మధ్య ఆర్ధిక పరమైన విభేదాల కారణంగానే జ్యోతిని హత్య చేయడానికి శ్రీనివాస్ ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలియజేసారు.

శ్రీనివాస్ బిహేవియర్ మీద ద్రుష్టి పెట్టిన పోలీసులు అతని ఫోన్ ట్యాపింగ్ చేసి అతని చర్యలని పరిశీలించారు.

అయితే నిందితులు కాల్ డేటా, అలాగే వారికి సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా వారే నిందితులు అని నిర్ధారించుకున్న పోలీసులు తాజాగా ప్రెస్ మీట్ మీత్తి నిందితులని మీడియా ముందు హాజరుపరిచారు.

అలాగే వారు జ్యోతిని హత్య చేయడానికి ఎలాంటి ప్లాన్ చేసారు అనే విషయాలని కూడా మీడియాకి తెలియజేసారు.

దీంతో జ్యోతి మర్డర్ లో చివరికి శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ నిందితులుగా నిర్ధారించి ఇంకా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించే ప్రయత్నంలో వున్నట్లు గుంటూరు రూరల్ ఎస్పీ తెలియజేసారు.

నువ్వుల నూనెలో వీటిని కలిపి తలకు రాశారంటే మీ జుట్టు రెట్టింపు అవుతుంది!