‘గుంటూరు కారం’ స్టోరీ లైన్ లీక్.. ఇలా ఉంటే బ్లాక్ బస్టర్ ఖాయమే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ మసాలా మూవీ ''గుంటూరు కారం''.

( Guntur Kaaram ).ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా శ్రీలీల, మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary )హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇక హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

"""/" / ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఇప్పుడు శరవేగంగా షూట్ పూర్తి చేస్తున్నారు.ఈ సినిమాలో కీలక రోల్స్ లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, సునీల్, అలీ, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మరి వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా గుంటూరు నగరం నేపథ్యంలో జరుగుతుందట.

ఆ నగరంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు ఒక లేడీ జర్నలిస్టు పని చేస్తుందట.

మరి ఈ జర్నలిస్టుతో అదే నగరంలో ఉంటున్న యువకుడు ప్రేమలో పెడతారట. """/" / ఆ తర్వాత ఆ యువకుడు విలన్స్ నుండి ఆ జర్నలిస్టును ఎలా కాపాడాడు.

విలన్స్ కు ఎలా ఎదురు తిరిగాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్ వైరల్ అవుతుంది.

సూపర్ స్టార్ చాలా ఏళ్ల తర్వాత మాస్ అండ్ పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.

దీంతో త్రివిక్రమ్( Trivikram Srinivas ) ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధం చేస్తున్నాడు.

చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.

వయనాడ్ బాధితుల విషయంలో మంచి మనస్సు చాటుకున్న విక్రమ్.. అన్ని రూ.లక్షల విరాళమంటూ?