గుజరాత్ బీజేపీ శాసన సభాపక్ష సమావేశం

గుజరాత్ లో బీజేపీ శాసన సభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో నూతన సీఎంను శాసన సభాపక్షం ఎన్నుకోనుంది.

ఈ క్రమంలో ఏర్పాటైన సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు రాజ్ నాథ్, అర్జున్ ముండాతో పాటు యడియూరప్పలు హాజరైయ్యారు.

కాగా రెండోసారి కూడా భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఈనెల 12న భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీచీఫ్ సీఆర్ పాటిల్ ఇప్పటికే ప్రకటించారు.

అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ గవర్నర్ కు సమాచారం ఇవ్వనుంది.

గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే..?