పవన్ కల్యాణ్ తో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) తో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ అయ్యారు.

ఇందులో ప్రధానంగా జనసేన పార్టీలో చేరికపై చర్చించారని తెలుస్తోంది.అయితే వైసీపీలో మార్పులు చేర్పుల్లో భాగంగా గూడూరు నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఎమ్మెల్సీ మేరుగ మురళీని పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.

దీంతో ఎమ్మెల్యే వరప్రసాద్( MLA Varaprasad ) వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

"""/"/ ఈ క్రమంలోనే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో వరప్రసాద్ సమావేశం అయ్యారు.

దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు తాను పోటీ చేయాలనుకున్న స్థానం అంశంపై కూడా చర్చించారని తెలుస్తోంది.

చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అశ్విని దత్!