పెళ్లైన 10 నిమిషాలకే వరుడు జంప్‌.. ఎందుకో తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

మ‌న భార‌త‌దేశంలో వివాహ బంధానికి ఎంత‌టి ప్రాధాన్య‌త ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.మూడు ముళ్ల బంధంలో ఏడడుగులు వేసి ఒక్క‌ట‌య్యే ఇద్ద‌రు మ‌నుషులు జీవిత‌కాలం తోడు, నీడ‌గా ఉండాల‌ని కోరుకుంటారు.

అయితే నేటి కాలంలో ప‌రిస్థితి అలా లేద‌నే చెప్పాలి.చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కే కొంద‌రి వివాహ బంధం మున్నాళ్ల ముచ్చటగా మారిపోతోంది.

అవగాహన లోపంతోనో, విపరీతమైన ఇగోతోనో.పచ్చని కాపురాలను చేతులారా కూల్చుకుంటున్నారు.

తాజాగా పెళ్లై ప‌ది నిమిషాలు కాకుండానే వ‌రుడు ప‌రార్ అయ్యాడు.మ‌రి వ‌రుడికి అంత క‌ష్టం ఏం వ‌చ్చింద‌ని ఆరా తీయ‌గా.

అత్తింటివాళ్లు బంగారం పెట్టలేద‌నే కోపంతో వెళ్లిపోయాడ‌ట‌.ఈ విచిత్ర ఘ‌ట‌న క‌దిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.తలుపుల మండలం ఓబులరెడ్డిపల్లికి చెందిన చిన్న అనే యువకుడికి.

కదిరి పట్టణం చైర్మన్‌ వీధిలో ఉండే తన అక్క కుమార్తెతో వివాహం నిశ్చ‌య‌మైంది.

ఈ క్ర‌మంలోనే నిన్న‌(శుక్రువారం) బంధుమిత్రుల మ‌ధ్య ఓ ఆల‌యంలో పెళ్లి కూడా అయింది.

అయితే పెళ్లిలో వ‌రుడికి మూడు తులాల బంగారు పెడతామని వధువు తరపువారు చెప్పి ఆర్థిక కార‌ణాల వ‌ల్ల పెట్ట‌లేక‌పోయారు.

బంగారం పెట్టలేద‌ని ఆగ్ర‌హించిన వ‌రుడు తాళి క‌ట్టి జంప్ అయ్యారు.అంతేకాకుండా, పోలీసుల‌కు ఫోన్ చేసి త‌నకు బలవంతంగా పెళ్లి చేశారని ఫిర్యాదు కూడా చేశాడు.

ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన పోలీసులు వ‌ధూవ‌రుల‌ను మ‌రియు వారి కుటుంబ‌స‌భ్యుల‌ను స్టేష‌న్ పిలిపించి విచార‌ణ చేయ‌గా.

వ‌రుడి గుట్టు ర‌ట్టు అయింది.బంగారం డిమాండ్ చేసినందుకు వ‌రుడికి గ‌ట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన‌ట్టు స‌మాచారం.

ప్రేమలు తర్వాత సరైన సినిమాలనే సెలెక్ట్ చేసుకున్న నస్లెన్, మమితా.. తిరుగుండదు..?