గంటలో పెళ్లి అనగా పారిపోయి తిరిగి వచ్చిన వరుడు..ఈ కథలో ట్విస్టులెన్నో..!

పెళ్లిళ్లు అంటే స్వర్గంలో నిర్ణయించ బడుతాయి అని పెద్దలు అంటూ ఉంటారు.పెళ్లి అంటేనే ఇద్దరి మనుషులను ఒక్కటిగా చేసేది.

కేవలం ఇద్దరు మనుషులను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కూడా ఏకం చేయగలిగే గొప్ప వేడుక.

పెళ్లి అనగానే ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది.బంధువులతో ఇల్లంతా కళకళ లాడుతూ ఉంటుంది.

అయితే అన్ని పెళ్ళిళ్ళు సంతోషంగానే ముగుస్తాయి అని చెప్పలేము.ఒక్కోసారి పెళ్లి వేడుకల్లో విషాదం కలిగించే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి.

తాజాగా ఒక పెళ్ళిలో ఇలాగె జరిగింది.భాజా భజంత్రీలతో.

మంగళ వాయిద్యాలతో.పెళ్లి మండపం అందంగా ముస్తాబయి ఉంది.

మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుంది అనగా పెళ్లి కొడుకు కనపడలేదు.అందరు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.

కానీ వరుడు పారిపోయిన కూడా ఈ పెళ్లి జరిగింది.ఎలా అంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ శివారు పెనమలూరు కు చెందిన అనిల్ అనే యువకుడికి పెళ్లి కుదిరింది.

ఈ నెల 21 న పెళ్లి జరిపించేందుకు ముహూర్తం పెట్టారు.21 వ తేదీ ఉదయం 10.

30 నిముషాలకు పెళ్లి అనగా గంట ముందు అనిల్ గోడ దూకి పారిపోయాడు.

అయితే ఈ పెళ్లి అతడి అంగీకారంతోనే కుదిరించు కున్నారు. """/"/ కానీ అంత బాగుంది అని అనుకుంటున్నా సమయంలో అలా అనిల్ చెప్పాపెట్టకుండా వెళ్లి పోవడంతో అందరు షాక్ అయ్యారు.

అనిల్ బైక్ మీద విజయవాడ నుండి హైదరాబాద్ కు బయల్దేరాడు.ఈ విషయంపై పెళ్లి కూతురు తల్లిదండ్రులు వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు.

అయితే వధువు వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అనిల్ కు తెలియడంతో మళ్ళీ బైక్ మీద విజయవాడకు బయల్దేరాడు.

సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వరుడు అనిల్ ను కృష్ణ జిల్లా నందిగామ దగ్గర అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆ తర్వాత ఇరు వర్గాల పెద్దలు మాట్లాడుకుని రాజీ కుదుర్చుకున్నారు.అనిల్ కు వధువుకు పెళ్లి జరిపించారు.

అయితే పెళ్లి కొడుకు ఎందుకు పారిపోయాడో.మళ్ళీ ఎందుకు వచ్చి పెళ్లి చేసుకున్నాడో ఇంత వరకు బయటకు రాలేదు.

వైరల్ వీడియో: ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..