ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఈనెల 22 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది.కాగా ఏప్రిల్ 30 నాటికి పదేళ్లు సర్వీసు దాటిని వారికి బదిలీ తప్పనిసరి అని తెలుస్తోంది.

అదేవిధంగా ఏప్రిల్ 30 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి అయిన వారి బదిలీలకు కూడా అవకాశం ఉంది.

సంక్షేమ శాఖల పరిధిలో పని చేసే విద్యాసంస్థల ఉద్యోగులకు మినహాయింపు ఉండనుంది.

వైరల్ వీడియో: పానీ పూరి వ్యాపారి మిమిక్రీ చూస్తే ఫిదా..