బదిలీపై వెళ్లిన కార్యదర్శికి ఘన సన్మానం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శి బదిలీ పై కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ కి బదిలీ పై వెళ్లిన సందర్భంగా కార్యదర్శి రాజా సులోచన ను గ్రామ పంచాయతీ లో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది తో పాటు బాగోద్వేగం తో ఆమె చేసిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి ఎంపిడిఓ జయశీలా తో పాటు మాజీ సర్పంచ్ గుంటీ లతశ్రీ శంకర్ లు శాలువా తో ఘన సన్మానం చేశారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లతశ్రీ,ఎంపిడిఓ జయశీల లు మాట్లాడుతూ గ్రామానికి ఆరు సంవత్సరాల కి పైగా గ్రామ అభివృద్దే ధ్యేయంగా ఎన లేని సేవలు అందించిన కార్యదర్శి కి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశీల, మాజిసర్పంచ్ గుంటి లతాశ్రీ, మాజీ ఉపసర్పంచి పిట్టల మోహన్, నాయకులు గుంట శంకర్, బోయిని హరీష్, ఫీల్డ్ అసిస్టెంట్ జింక మహేందర్, పంచాయతీ సిబ్బంది నాగరాజు, రమేష్, మల్లేశం, సంజీవ్, ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఈ కోలీవుడ్ సినిమాల సీక్వెల్స్‌ వస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..