కన్న కూతురు చేసిన పనికి తల్లి ఏమి చేసిందంటే!

పెళ్ళై భర్త చనిపోయిన ఇంట్లో ఉంటున్న కూతురు ప్రియుడి తో కలిసి వెళ్ళిపోయింది అన్న కారణంగా ఆ తల్లి చేసిన పనికి స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

కర్ణాటక లోని మాండ్యా జిల్లా కేఆర్ పేటకు చెందిన సావిత్రమ్మ కు లక్ష్మి అనే కూతురు ఉంది.

అయితే భర్త చనిపోవడం తో కొడుకు ప్రజ్వల్ తో కలిసి తల్లి సావిత్రమ్మ తో పాటే ఉంటుంది.

అయితే ఈ క్రమంలోనే లక్ష్మి కి పేస్ బుక్ లో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీయడం తో ప్రియుడి వద్దకే వెళ్ళిపోయింది.

దీనితో విషయం తెలుసుకున్న సావిత్రమ్మ తన కూతురు చేసిన పనికి వూరిలో పరువు పోయింది అని భావించి మనవడు ప్రజ్వల్ తో కలిసి ఆత్మహత్య కు యత్నించింది.

సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి.ప్రజ్వల్ కాళ్లు చేతులు కట్టేసి అందులో తోసేసింది.

ఆపై తాను కూడా అందులో దూకేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.అయితే మరోపక్క ప్రజ్వల్ తల్లి లక్ష్మి మాత్రం నా కుమారుడు ప్రజ్వల్ ని చంపడానికి ఇలా తన తల్లి ప్లాన్ చేసింది అంటూ ఆరోపిస్తుంది.

ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

దశాబ్ధాలుగా ఉంటున్నా , ఓటు వేస్తున్నా.. నేను అమెరికా పౌరుడిని కాదంట, ఓ పెద్దాయన ఆవేదన