ఘనంగా మహాలక్ష్మి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

స్థానిక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహిళలు ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.మహిళలు మంగళ హారతులు, నైవేద్యం సమర్పించి పాడి పంటలు, పిల్లాపాపలు చల్లగా ఉండాలని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపెల్లి దేవంతం, ప్రధాన కార్యదర్శి వనం రమేష్, ఉపాధ్యక్షులు శ్రీరాం సుదర్శన్ , గోషికే దేవదాస్, యూత్ ప్రెసిడెంట్ సుంకి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

వీడియో: గిల్లి పంచాయతీ పెట్టుకున్న ఓలా డ్రైవర్.. ఎత్తి కుదేసిన ఆడి ఓనర్..