రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పద్మావతి

సూర్యాపేట జిల్లా( Suryapet District ):రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకానికి సంబంధించిన వీడియో కాన్ఫిరెన్స్ ని సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి( Kodada MLA Padmavathi Reddy ), సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని జిల్లాల వారీగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు,వివిధ మండలాల రైతులతో మాట్లాడుతూ రైతుల ఆనందాన్ని తెలుసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఇచ్చిన మాట తప్పదని,రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.

బీఆర్ఎస్ వాళ్ళు రాజనామా పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు.అనంతరం ఎమ్యల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మండలంలోని అన్ని గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు.

ఆ హీరోయిన్ అంటే పిచ్చి.. చిలిపి కోరికలు కలిగే అంటూ తనికెళ్ల భరణి ఆసక్తికర వ్యాఖ్యలు…