రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు.

స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ పరమేశ్వరుని చల్లని చూపు ప్రజలందరిపై ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.

వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చందుర్తి జడ్పిటిసి నాగం కుమార్ ,రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత లక్ష్మి, ధర్మపురి శ్రీనివాస్, నక్క సాయి తదితరులు ఉన్నారు.

టోవినో థామస్ ”ఏఆర్ఎమ్” (ARM) తెలుగు ట్రైలర్ విడుదల !!