పోచమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని కొనాయపల్లిలో లక్కామారు మున్నూరు కాపు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల మహోత్సవ కార్యక్రమంలో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) పాల్గొన్నారు.

సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి దయతో సకాలంలో వర్షాలు పడి రైతులు, ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు అనంతరం ఎమ్మెల్యేకు మున్నూరు కాపు సభ్యులు చిరు సన్మానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భారతదేశంలో కొరియన్ యూట్యూబర్ అపహరణ.. చివరికి ఏమైందో తెలిస్తే..?