బాలయ్యతో సినిమా చేయబోతున్న క్రాక్ డైరెక్టర్..

నటసింహం నందమూరి బాలకృష్ణ వరస సినిమాలను అంగీకరిస్తూ బిజీగా మారబోతున్నాడు.ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి.

దీని తర్వాత రావిపూడితో సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

అయితే బాలయ్య క్రాక్ సినిమాతో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

తాజాగా బాలకృష్ణతో గోపీచంద్ మలినేని భేటీ అయ్యారు.ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది.

గోపీచంద్ మలినేని ఇప్పటికే ఒక కథను కూడా రెడీ చేసాడని అందుకే బాలకృష్ణను కలిసి ఆ కథను కూడా వినిపించాడని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే గోపీచంద్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారట. """/"/ మొన్నటి వరకు రూమర్ అని అంతా అనుకున్నారు.

కానీ గోపీచంద్ మలినేని బాలకృష్ణతో ఫోటో దిగి సోషల్ మీడియాతో పెట్టడంతో సినిమా కన్ఫర్మ్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో నుండి వినిపిస్తున్న టాక్.

ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

తాజాగా తీసిన క్రాక్ చిత్రంలో రవితేజ ను కూడా పోలీస్ పాత్రలో చూపించి మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్..!!