బాలకృష్ణ సినిమా కోసం పాత పేపర్లు తిరగేస్తున్న గోపీచంద్ మలినేని

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని.

ఈ సినిమా కోసం రియల్ లైఫ్ స్టొరీని తీసుకొని దానిని కమర్షియల్ ఫార్మాట్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రెజెంట్ చేసి అందరిని మెప్పించాడు.

అలాగే రవితేజకి కూడా మూడు ఫ్లాప్ ల తర్వాత సూపర్ హిట్ అందించాడు.

ఈ నేపధ్యంలో గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమాని నందమూరి బాలకృష్ణతో చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపొయింది.ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత గోపీచంద్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే బాలయ్యతో చేసే కథపై ఇప్పుడు గోపీచంద్ మలినేని కసరత్తులు మొదలు పెట్టారు.

క్రాక్ సినిమా కోసం ఎంచుకున్న రియల్ లైఫ్ సంఘటనలు వర్క్ అవుట్ కావడంతో ఇప్పుడు బాలకృష్ణ కూడా అలాంటి కథనే ఎంచుకోవడానికి గోపీచంద్ రెడీ అయ్యాడు.

ఈ నేపధ్యంలో రీసెంట్ గా ప్రకాశం జిల్లా వేటపాలెంలోని పురాతనమైన గ్రంథాలయానికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

అక్కడ వేటపాలెం గ్యాంగ్ కి సంబంధించిన వివరాల కోసం ఆయన సెర్చ్ చేశాడని అంటున్నారు.

వేటపాలెం నేపధ్యంలో గతంలో జరిగిన సంఘటనల గురించి గోపీచంద్ పూర్తిగా పరిశోధన చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో బాలయ్య కోసం గోపీచంద్ ఒంగోలు బ్యాక్ డ్రాప్ కథాంశమే ఎంచుకున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

అలాగే క్రాక్ లో వేటపాలెం సముద్రం బ్యాక్ డ్రాప్ లో పెట్టినట్లు యాక్షన్ సీక్వెన్స్ ని బాలయ్య కోసం డిజైన్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!