బండలింగంపల్లి పై గోపాల్ రావు పల్లె టీం ఘన విజయం

రాజన్న సిరిసిల్ల జిల్లా :గోపాల్ రావు పల్లె గ్రామం లో నిర్వహించిన ఎసిరెడ్డి మల్లారెడ్డి- నర్సవ్వ గార్ల స్మారక క్రికెట్ టోర్నమెంట్ జీపీఎల్ సెషన్ -1 పోటీలలో ఫైనల్ మ్యాచ్ లో బండలింగంపల్లి పై గోపాల్ రావు పల్లె టీమ్ ఘనవిజయం సాధించింది.

రన్నర్ ఆఫ్ ద టీమ్ గా బండలింగంపల్లి టీమ్ నిలిచింది.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన సన్నీ,ఇరు టీమ్ లకు ట్రోఫీని అందజేయడం జరిగింది .

ఇట్టి కార్యక్రమంలో మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఎసిరెడ్డి రాంరెడ్డి,తాజా మాజీ ఉపసర్పంచ్ సతీష్ యాదవ్, యాదవ సంఘం సొసైటీ అధ్యక్షుడు మిరల శ్రీనివాస్ యాదవ్, క్యాప్టెన్ సునీల్ & టీమ్ సభ్యులు పాల్గొనడం జరిగింది, టీమ్ సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది.

పవన్ సరసన అనసూయ.. ఇక మోత మోగిపోవాలంటున్న యాంకర్?