రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మరో 10 సమ్మర్ స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే!
TeluguStop.com
అవును, భారతీయ రైల్వే( Indian Railways ) తమ ప్రయాణికులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది.
వేసవి కాలం దృష్ట్యా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడపాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో ప్రత్యేక రైళ్లు నడిపనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.విశాఖపట్నం, పాట్నా, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలకు 6,369 ట్రిప్పులతో ఈ ట్రైన్స్ నడవనున్నాయని తెలుస్తోంది.
ఇక గతేడాది సమ్మర్ సీజన్లో 348 ప్రత్యేక రైళ్లతో 4,599 ట్రిప్పులను నడపగా.
ఈ ఏడాది అదనంగా 1,770 ఎక్కువ ట్రిప్పులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది మన రెయిల్వేశాఖ.
"""/" /
గత వేసవిలో అయితే ఒక్కో రైలుకు సగటున 13.2 ట్రిప్పులు నడపగా, ఈ ఏడాది ఆ సంఖ్య 16.
8గా ఉంటుందని రైల్వే అధికారులు( Railway Officials ) తెలపడం గమనార్హం.కాగా ఈ ట్రైన్స్ విశాఖపట్నం -పూరీ- హౌరా, పాట్నా - సికింద్రాబాద్, ముంబై- పాట్నా, పాట్నా - యశ్వంత్పూర్, ఢిల్లీ - పాట్నా, బరౌనీ - ముజఫర్పూర్, ఢిల్లీ - కత్రా, చండీగఢ్ -గోరఖ్పూర్, ఆనంద్ ఫ్వి కో హార్ -పాట్నా, ముంబై-గోరఖ్పూర్ మధ్య నడవనున్నట్టుగా తెలుస్తోంది.
"""/" /
ట్రైన్ నంబర్ - 07435 కాచిగూడ-నాగర్కోయిల్( Kachiguda-Nagarkoil ) స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 26, జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
అదేవిధంగా ట్రైన్ నంబర్ - 07436 నాగర్కోయిల్ -కాచిగూడ స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది.
కాగా ఈ ట్రైన్లు మల్కాజ్ గిరి, మిర్యాలగూడ, నల్గొండ, నడికుడి, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, బాపట్ల, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, ఒంగోలు, వెల్లూరు, శ్రీరంగం, మధురై తదితర స్టేషన్లలో ఆగుతాయి.
ఇది చేతిరాతన.. ఇంకా ఏదో ప్రింట్ అవుట్ అనుకున్నామే!