ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలు టికెట్ ఛార్జీలు తగ్గించిన ఇండియన్ రైల్వే..
TeluguStop.com
ఏసీ-3 టైర్( AC-3 Tire ) ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరను తగ్గిస్తూ భారతీయ రైల్వే( Indian Railways ) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, బెడ్స్ యథావిధిగా అందజేస్తామని రైల్వే అధికారులు తాజాగా పేర్కొన్నారు.
ఇప్పటికే ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారు చెల్లించిన అదనపు డబ్బు తిరిగి ఇవ్వడం జరుగుతుందని కూడా అధికారులు స్పష్టం చేశారు.
రైల్వే బోర్డు ఉత్తమ, చౌకైన AC ప్రయాణం సేవను అందించడానికి 3-టైర్ ఎకానమీ కోచ్లను ప్రవేశపెట్టింది.
ఈ కోచ్ల ధర సాధారణ AC 3 టైర్ కోచ్ల కంటే 6-7% తక్కువ.
3-టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధర గత ఏడాది ఏసీ-3 టైర్ టికెట్ ధరతో సమానంగా చేసినప్పటి నుంచి తగ్గించబడింది.
ఏసీ 3 టైర్ కోచ్లో 72 బెర్త్లు ఉండగా, ఏసీ 3 టైర్ ఎకానమీలో 80 బెర్త్లు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
"""/" /
ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్( AC-3 Tier Economy Class ) ద్వారా రూ.
231 కోట్లు ఆర్జించింది.డేటా ప్రకారం, ఏప్రిల్ నుంచి ఆగస్టు 2022 వరకు, ఈ కోచ్లలో 15 లక్షల మంది ప్రయాణించారు, దీని ద్వారా రూ.
177 కోట్ల ఆదాయం వచ్చింది.రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చౌకగా అందించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది.
"""/" /
ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధరను తగ్గించడం ద్వారా ఎక్కువ మంది తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
ఈ చర్య ఈ సేవను ఉపయోగించే వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.ఇప్పటికే తమ టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు కూడా వాపసు పొందుతారు.
Bet Plays Mobile App And Mobile Experience: A Practical Guide For Canadian Players