క్రికెట్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ లేకుండానే ఫ్రీగా స్టేడియంలో మ్యాచ్ చూడొచ్చిలా!

క్రికెట్ అంటే ఇష్టపడనివారు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి.ఇక అందుబాటులో ఓ బడా క్రికెట్ స్టేడియం ఉంటే అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎప్పుడు జరుగుతాయో అని పడిగాపులుగాసి మరీ చూస్తాం.

ఎందుకంటే క్రికెట్ మ్యాచెస్ ని ప్రత్యక్షంగా చూడాలని ఎవరు అనుకోరు.ఇక కేవలం దగ్గరలో ఉన్న స్టేడియంలో మాత్రమే కాకుండా విదేశాల్లో జరిగిన మ్యాచ్ లను సైతం చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు.

అయితే ఎక్కడ మ్యాచ్ చూడాలన్నా డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తేనే కుదురుతుందనే విషయం విదితమే.

అయితే ఇక్కడ ఎలాంటి రుసుము లేకుండానే స్టేడియం లోకి క్రికెట్ చూడటానికి అనుమతిస్తే నిజంగా సూపర్ కదూ.

అయితే క్రికెట్ స్టేడియం నిర్వాహకులు ఇలాంటి ఆఫర్లు ఏనాడూ ప్రకటించరు.కానీ ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన ఆఫర్ క్రికెట్ ప్రేక్షకులకు రెడీగా వుంది.

ఇక మీకు తెలిసినదే మహిళా T20లో భాగంగా టీమిండియా ఉమెన్స్ జట్టు ఆస్ట్రేలియా జట్టు తో తలబడబోతుంది.

ఐదు మ్యాచ్ల T20 సిరీస్ హోరాహోరీగా సిద్ధం కాబోతోంది. """/"/ అవును, ఈ నెల 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా టీమ్ ఇండియా ఉమెన్స్ జట్ల మధ్య ఈ సిరీస్ ప్రారంభం చాలా హాట్టహాసంగా స్టార్ట్ కాబోతోంది.

ఇక ఈనెల 20 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.అయితే ముంబై వేదిక జరిగే ఈ T20 మ్యాచ్లను చూడటానికి వచ్చే అభిమానుల నుంచి ఎలాంటి చార్జీలు తీసుకోకుండానే అవకాశం కల్పిస్తున్నట్లు స్టేడియం నిర్వాహకులు తాజాగా తెలపడం గమనార్హం.

ఈ విషయం ఆనోటా ఈనోటా బయటకి పొక్కడంతో ప్రేక్షకులు ఇక స్టేడియంకు వెళ్లేందుకు క్యూలు కడుతున్నారు.

షాకింగ్ వీడియో: భోజనం వడ్డిస్తుండగా కూరలో ప్రత్యక్షమైన పాము.. చివరకు..