ఏపీ జూడాలకు శుభవార్త

జూనియర్‌ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని జూనియర్‌ డాక్టర్లకు ప్రతి నెలా అందిస్తున్న స్టైఫండ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.

కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.పెంచిన స్టైఫండ్‌ను ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపజేయనున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య, రెండు ప్రభుత్వ దంత వైద్య కాలేజీల్లో హౌస్‌ సర్జన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్‌ స్పెషాలిటీ విద్యార్థులకు ఈ స్టైఫండ్‌ పెంపు వర్తిస్తుంది.

రాజ్ తరుణ్ తో విడిపోవడానికి అతనే కారణం.. లావణ్య సంచలన వ్యాఖ్యలు!