పీవీకి భారతరత్న ఇవ్వడం తెలంగాణకు గర్వకారణం

బహుభాషా కోహిదుడు పీవీ నరసింహారావు( PV Narasimha Rao ).బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా:మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న బిరుదుతో గౌరవించడం గొప్ప పరిణామమని తెలంగాణకు గర్వకారణం అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య అన్నారు.

మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి అత్యున్నతమైన స్థానానికి ఎదిగిన వ్యక్తి పీవీ నరసింహారావు అని తనను కేంద్ర సర్కారు గుర్తించి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలుగువారికి అరుదైన గౌరవం దక్కిందని పేర్కొన్నారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ నరసింహారావు అని కొనియాడారు.బహుభాష కోవిదుడు,బహుముఖ ప్రజ్ఞాశాలి అని గుర్తు చేశారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి పురోగతిని సాధించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని అభివర్ణించారు.

కేజీఎఫ్3 సినిమాలో హీరో అజిత్ అంటూ జోరుగా ప్రచారం.. ఆ ఛాన్స్ ఉందంటూ?