ఛాన్స్ ఇచ్చిన పూరి గారే గుర్తుపట్టలేకపోయారు... హీరో కామెంట్స్ వైరల్!

సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వినూత్నమైన పాత్రలలో నటిస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న హీరో సత్యదేవ్ గురించి అందరికీ తెలిసిందే.

ఈయన హీరోగా మాత్రమే కాకుండా కథ ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలలోనైనా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలకపాత్రలో నటించారు.అదేవిధంగా తమన్నాతో కలిసి నటించిన గుర్తుందా సీతాకాలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సత్యదేవ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశాడు.

తనకు ముందుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.

చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండడంతో చేస్తున్న ఉద్యోగం కూడా మానేసి సినిమాల కోసం తిరిగానని అయితే జ్యోతిలక్ష్మి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలియగానే ఆడిషన్స్ కి వెళ్ళానని తెలిపారు.

"""/"/ ఇక ఆడిషన్స్ కి పోతే ఆడిషన్స్ పూర్తి అయిన తర్వాత పూరి జగన్నాథ్ నన్ను సెలెక్ట్ చేశారు.

అయితే ఈ సినిమాలో తప్పకుండా నాకు విలన్ పాత్ర లభిస్తుందని చెప్పి అప్పటికి నా శరీర బరువు 90 కేజీలు ఉండగా కష్టపడి 16 కిలోలు తగ్గాను.

ఈ విధంగా 16 కిలోలు తగ్గి పూరీ దగ్గరికి వెళ్లడంతో ఆయన తనని గుర్తుపట్టలేకపోయారని చెప్పారు.

ఇదేంటి పేషంట్ లా తయారయ్యావు అయినా నీకు విలన్ పాత్ర కాదు హీరో పాత్ర అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా తిరిగి మరోసారి బరువు పెరిగానని, ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే సత్యదేవ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మేడం టుస్సాడ్స్ లో చరణ్ మైనపు విగ్రహం.. సంతోషంలో మెగా ఫ్యాన్స్?