పెళ్లయిన ప్రియుడుని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న ప్రియురాలు..!

ఓ ప్రేమ జంట దాదాపుగా ఏడు సంవత్సరాల క్రితం ప్రేమకు వీడ్కోలు పనికి ఎవరి దారి వారు చూసుకున్నారు.

అయితే ఆ ప్రేమికుడు మరో యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసి ఆ ప్రియురాలు సహించలేకపోయింది.

ఏకంగా పెళ్లయిన ప్రియుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులోని చెన్నైలో( Chennai, Tamil Nadu ) చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

చెన్నై వేళచ్చేరి కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పార్తిబన్( Parthiban ), రాణిపేటకు చెందిన సౌందర్య( Soundharya ) కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో గాఢంగా ప్రేమించుకున్నారు.

ఏడేళ్ల తర్వాత మనస్పర్ధలు కారణంగా ఈ ప్రేమికులు విడిపోయి దారి వారు చూసుకున్నారు.

గత నెల 5వ తేదీన పార్తిబన్ ఐటీ ఉద్యోగం చేసే మహిళను వివాహం చేసుకున్నాడు.

తన ప్రియుడు వివాహం చేసుకున్న విషయం సౌందర్యకు తెలియడంతో తాను ప్రియుడిని మర్చిపోలేక పోతున్నానని, తనకు తన ప్రియుడితో వివాహం జరిపించాలని తన తల్లి, బంధువుల ముందు రోధించింది.

దీంతో సౌందర్య తల్లితోపాటు బంధువులైన శివ కుమార్, రమేష్( Siva Kumar, Ramesh ) లు పార్తిబన్ ను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ రచించారు.

"""/" / పార్తిబన్ రోజు లాగే శుక్రవారం కూడా ఆఫీసుకు బయలుదేరాడు.మార్గమధ్యంలో కాపు కాసి కారులో పార్తిబన్ ను కిడ్నాప్ చేసి నేరుగా కాంచీపురం లోని ఓ ఆలయానికి తీసుకువెళ్లి బలవంతంగా సౌందర్య మెడలో తాళి కట్టించారు.

తన భర్త ను ఎవరో కిడ్నాప్ చేశారని మొదటి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ల ఆధారంగా పార్తిబన్ కిడ్నాప్ కేసును చేదించారు.

మాజీ ప్రియురాలు సౌందర్య తో పాటు ఆమె తల్లిని సహాయం చేసిన బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అల్లు అరవింద్ కోసమే అన్ స్టాపబుల్ చేశాను.. బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!