బ్రేకింగ్ ! గిడ్డి ఈశ్వరి పద్ధతి మార్చుకో... మావోయిస్టుల సంచలన లేఖ

మావోయిస్టుల దాడిలో ఇప్పటికే ఎమ్యెల్యే కిడారి సర్వేశ్వరరావు , మాజీ ఎమ్యెల్యే సోమా పై దాడి చేసిన మావోయిస్టులు ఇక తరువాతి టార్గెట్ ఫిరాయింపు ఎమ్యెల్యే గిడ్డి ఈశ్వరి అని తమ చర్యల ద్వారా తెలియజేయడంతో ఆమెకు ఇప్పటికే పోలీసు భద్రత బాగా పెంచారు.

అయినా ఆమె ప్రాణ భయంతో నియోజకవర్గంలో తిరగడానికి వణికిపోతోంది.ఇక మావోయిస్టుల విషయానికి వస్తే.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమాపై దాడి చేసిన మావోయిస్టులు ఆ ఘటనపై స్పందించకుండా మౌనంగా ఉంటూ వచ్చారు.

కిడారిని హత్య చేయడానికి ముందు అతడు పార్టీ మారిన సమయంలో ఎంత డబ్బు తీసుకున్నది ఆరా తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే దాడి చేసిన ఇంతకాలం తరువాత మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఒక లేఖను విడుదల చేసింది.

ఈ లేఖలోని అంశాలు అధికార పార్టీ నేతలను మరింత భయపెట్టేలా ఉన్నాయి.ముఖ్యంగా గిడ్డి ఈశ్వరి వ్యవహారాన్ని మావోయిస్టులు ఈ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

బాక్సైట్ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా పనిచేసినా వారిని వదిలిపెట్టబోమని లేఖలో హెచ్చరించారు.గిడ్డి ఈశ్వరి 20 కోట్లకు అమ్ముడుపోయి టీడీపీలో చేరారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ పార్టీ మారినప్పుడు తీసుకున్న సొమ్మును, అవినీతి చేసి సంపాదించిన డబ్బును రెండు నెలల్లోగా గిరిజనులకు పంచి క్షమాపణ చెప్పాలని గిడ్డి ఈశ్వరికి మావోయిస్టులు లేఖరూపంలో హెచ్చరికలు జారీ చేశారు.

లేకుంటే కిడారి సర్వేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందని, గిడ్డి ఈశ్వరి పద్దతి మార్చుకోవాలని సూచించారు.

గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు కిడారిని హెచ్చరించామని.కానీ కిడారి తీరు మారలేదన్నారు.

మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో వచ్చిన ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఆ స్థానాల్లో మేమే గెలుస్తాం .. బీఆర్ఎస్ ధీమా వెనుక ..?