పాన్ ఇండియా రేంజ్ లో గజిని సీక్వెల్స్… అల్లు అరవింద్ ప్లాన్ మామూలుగా లేదు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya ) మురుగదాస్ ( Muragadas) కాంబినేషన్లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం గజని( Ghajini ).

ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా తెలుగులో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకున్నారు.

ఇక డైరెక్టర్ గా మురుగదాస్ కి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.

ఇలా గజినీ సినిమా ఎంతో మంచి సక్సెస్ సాధించింది.అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు నిర్మాత అల్లు అరవింద్.

ఈ క్రమంలోని ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. """/" / గజిని సినిమాలో సూర్య నటించగా గజిని సీక్వెల్ ( Ghajini Sequel ) చిత్రంలో మాత్రం నటించడానికి సూర్య పెద్దగా ఆసక్తి చూపించడం తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సూర్య బదులు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్( Aamir Khan ) నటించబోతున్నట్లు సమాచారం.

ఇక అమీర్ ఖాన్ గజిని సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

"""/" / అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని అల్లు అరవింద్( Allu Aravind ) పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే సీక్వెల్ చిత్రంలో సూర్య ఆసక్తి లేకపోవడంతో అమీర్ ఖాన్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

"""/" / ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలు అల్లు అరవింద్ ఉన్నారు.

ఇక ఈ సినిమాకి కూడా మురుగదాస్ డైరెక్షన్ చేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా మురగదాస్ అమీర్ ఖాన్ అల్లు అరవింద్ కాంబినేషన్లో గజిని సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు సమాచారం.

రూటు మార్చిన నాగార్జున…సక్సెస్ అవుతాడా..?