ఏపీలో ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్( Gazette Notification ) విడుదలైంది.సీఈసీ నోటిఫికేషన్( CEC Notification ) ఆధారంగా సీఈవో గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేశారు.

ఈ మేరకు ఏపీ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.

ఈ ప్రకారం రాష్ట్రంలో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ను అధికారులు నిర్వహించనున్నారు.

పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈవో వెల్లడించారు.

అదేవిధంగా అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగనుంది.

అలాగే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కించనున్న అధికారులు అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు.

వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మేకప్ అక్కర్లేదు.. న్యాచురల్ బ్యూటీ అయిపోతారు!