వైసీపీ లో చేరికకు అంతా సిద్ధం చేసుకున్న గంటా

టీడీపీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ పార్టీ లో చేరడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఆయన త్వరలో పార్టీ మారుతున్నట్లు ఇప్పటికే గత కొద్దీ రోజుల నుంచి ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు తాజాగా దానిపై ఒక క్లారిటీ వచ్చింది.

ఈ నెలలోనే వైసీపీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.

ముందుగా ఆగస్టు 15 న వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా 16 వ తేదీన ఆయన ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది.

తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గంటా తో పాటు పలువురు టీడీపీ మాజీ నేతలు వైసీపీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.

మరోపక్క గంటా పార్టీ మార్పు పై వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చేసిన అరాచకాలు, కేసుల వల్ల అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడం కోసం దొడ్డిదారిలో పార్టీ లోకి వస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారం కోరుకొనే పక్షి గంటా అంటూ అవంతి వ్యాఖ్యలు చేశారు.గతంలో ఆయన భూకుంభకోణం లో ఆరోపణలు ఎదుర్కొన్నారు అని, ఎంపీ విజయ సాయిరెడ్డి,నేను మాట్లాడామని గుర్తు చేశారు.

ప్రస్తుతం వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న గంటా ఇక ఇప్పుడు నేరుగా పార్టీ నేతగా మారిపోనున్నారు.

ఒకప్పుడు మిత్రులుగా ఉన్న గంటా,అవంతి ఇప్పుడు శత్రువులు గా మారారు.మొన్నటిదాకా ఒకే పార్టీలో ఉన్న వీరిలో ఒకరు పార్టీ మారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కాగా, మొన్నటి దాకా మంత్రిగా ఉన్న అయన పార్టీ ఓడిపోవడంతో ఎమ్మెల్యేగా సరిపెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు ఆయన మళ్లీ అవంతి ఉన్న పార్టీ అనగా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు అన్న ప్రచారం మొదలుకావడం తో అవంతి తనదైన శైలి లో మండిపడ్డారు.

కావాలని కేసుల నుంచి తప్పించుకోవాలి అని గంటా ఇలా దొడ్డి దారిలో పార్టీలో చేరే ఆలోచన చేస్తున్నారు అంటూ ఆరోపించారు.

మరి అసలకే గంటా పేరు చెబితేనే మండిపడుతున్న అవంతి ఈనెల 16న గంటా వైసీపీ లో చేరితే ఈయన ఎలా స్పందిస్తారో చూడాలి.

జయప్రద, రమ్యకృష్ణ, కాజల్ సందడి చేసిన జీ తెలుగు 19వ వార్షికోత్సవ వేడుక జీ మహోత్సవం, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు