మంగళగిరిలో దారుణం... సర్టిఫికెట్లు ఇప్పిస్తామని యువతిని ఏం చేశారంటే...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది.యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని చెప్పి ముగ్గురు యువకులు ఒక మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

యూనివర్సిటీకు సర్టిఫికెట్ల కోసం వచ్చిన మహిళకు ముగ్గురు యువకులతో పరిచయం ఏర్పడింది.మహిళ ఆ ముగ్గురు యువకులు నిజంగానే సర్టిఫికెట్లు ఇప్పిస్తారని భావించి యువకుల మాటలు నమ్మింది.

ఆ తరువాత ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడగా మహిళ ముగ్గురు యువకుల గురించి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకొనివెళ్లి ముగ్గురు యువకులను వేరువేరుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

"""/"/ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నా నేరాల సంఖ్య తగ్గకపోవడం గమనార్హం.

చట్టాలలో మరిన్ని మార్పులను తీసుకొవచ్చి చట్టాలు కఠినంగా అమలు చేస్తే మాత్రమే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?